ఈ రోజుల్లో ఎవరైనా మరణిస్తే సాటి వారు కూడా పట్టించుకోని ఘటనలు చూస్తున్నాం. అయితే, తనను పెంచిపోషించిన యజమాని మరణించగా ఓ కోతి తీవ్ర మనోవేదనకు గురైంది. చివరి వరకు అతని అంత్యక్రియల్లో పాల్గొని అంతిమ వీడ్కోలు పలికింది. ఈ ఘటన ఝార్ఖండ్లోని డియోఘర్ జిల్లాలో చోటుచేసుకుంది. మున్నా సింగ్ అనే వ్యక్తి మరణించగా.. పెంపుడు కోతి అతడి అంత్యక్రియల్లో పాల్గొన్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.