మౌనీ అమావాస్యను పురస్కరించుకొని భక్తులు భారీగా తరలిరావడంతో మహా కుంభమేళాలో నేడు తొక్కిసలాట జరిగి పలువురు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన తన కుటుంబ సభ్యుడికి ఓ మహిళ నోటి ద్వారా ఆక్సిజన్ అందించారు. ఈ హృదాయ విదారక దృశ్యం చూసిన నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు.