భారీ వర్షాలు, వరదల కారణంగా చాలా ప్రాంతాలు, రోడ్లు నీటమునిగాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు నడిపే 1,400 బస్సులను రద్దు చేసినట్లు TGSRTC అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఖమ్మం, విజయవాడ, మహబూబాబాద్ వైపు వెళ్లే బస్సులను పూర్తిగా రద్దు చేసినట్లు తెలిపారు. మరోవైపు విజయవాడ వెళ్లే బస్సులను గుంటూరు మీదుగా మళ్లించినట్లు తెలిపారు. వరద ఉద్ధృతి తగ్గిన తర్వాత సర్వీసులను పునరుద్ధరిస్తామన్నారు.