కేదార్నాథ్ నుంచి గుప్తకాశికి వెళ్తున్న ఆర్యన్ ఏవియేషన్ హెలికాప్టర్ గౌరీకుండ్ అడవుల్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్తో పాటు ఏడుగురు మృతి చెందారు. ప్రమాదానికి వాతావరణం అనుకూలించకపోవడమే కారణమని అధికారులు తెలిపారు. ఘటనపై సీఎం ధామీ విచారం వ్యక్తం చేశారు. SDRF, రెస్క్యూ బృందాలు అక్కడ సహాయక చర్యలు చేపట్టాయి. UCADA-DGCA చార్ధామ్ హెలికాప్టర్ సేవలను తాత్కాలికంగా నిలిపాయి.