ధనుష్, రష్మిక మందన్నా, నాగార్జున ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న 'కుబేర' సినిమా నుంచి కీలక అప్డేట్ వచ్చింది. మేకర్స్ తాజాగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్తో ట్రైలర్ రేపు విడుదల కానున్నట్టు వెల్లడించారు. ట్రైలర్ విడుదలతో మూవీపై మరింత ఆసక్తి పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.