భారత్– పాకిస్తాన్ సరిహద్దుల్లో జరుగుతున్న దాడుల నేపథ్యంలో దేశంలోని ప్రముఖ ప్రదేశాల్లో, సెంటర్లు, ప్రభుత్వ కార్యకలాపాలు వద్ద కేంద్ర ప్రభుత్వం భారీగా భద్రతా పెంచుతోంది. దీంతో బెంగళూరు, శ్రీహరికోటతో సహా 11 ఇస్రో కేంద్రాల్లో కూడా హై అలర్ట్ జారీ చేసింది. కేంద్రాల వద్ద సీఐఎస్ఎఫ్ సిబ్బంది సంఖ్యను పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రముఖ రీసెర్చ్ సెంటర్ల వద్ద కూడా భద్రతను పెంచారు.