హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ ఇచ్చింది. నగరంలోని చార్మినార్, ఫలక్నుమా ప్యాలెస్ దగ్గర పనులు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వారసత్వ కట్టడాలకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ దాఖలైన పిల్పై ఈ మేరకు విచారణ చేపట్టింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని.. తదుపరి విచారణ వరకు ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది.