భారత్– పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే శ్రీనగర్లో ప్రస్తుతం పాక్ డ్రోన్లతో దాడి చేస్తోంది. దీంతో శ్రీనగర్ మొత్తం హైటెన్షన్ నెలకొంది. సైరన్లు సైతం మోగుతున్నాయి. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రజలను బయటకు రావద్దంటూ అధికారులు సూచిస్తున్నారు. కాగా ఇప్పటికే జమ్మూ సీఎం ఒమర్ అబ్దుల్లా సైతం పెద్ద శబ్దాలు వస్తున్నాయంటూ Xలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.