ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు భారత్, పాక్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 1.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది. పాక్కు ఈ మ్యాచ్ చావో రేవో కాగా భారత్ మాత్రం రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. అయితే నేటి మ్యాచులో రోహిత్, కోహ్లీ రాణిస్తే పాక్ ఇంటికెళ్లడం ఖాయం. ఏదీ ఏమైనా భారత్ ఈ మ్యాచులో గెలిచి 2017 ఫైనల్కు ప్రతీకారం తీర్చుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.