హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. పశుపోషణ ద్వారా గ్రామీణ రైతుల ఆదాయ మార్గాలను పెంపొందించే దిశగా విప్లవాత్మక చర్యలు చేపట్టింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆవు, గేదె పాలకు కనీస మద్దతు ధర ప్రకటించి, పాడి రైతులకు ఆర్థిక భరోసా కల్పించింది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని వేలాది మంది పశుపోషకులకు గొప్ప ఊరటనిస్తూ, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు దోహదపడనుంది.