తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా రేపు పలు జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తెలంగాణలోని కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఖమ్మం జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని జిల్లా అధికారులు ప్రకటించారు.