జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు భారీ ఉగ్ర దాడికి తెగపడిన సంగతి తెలిసిందే. పహల్గాంలోని టూరిస్టులపై కాల్పులు జరపడంతో ముగ్గురు మరణించగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కాల్పుల విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ పరిస్థితిని సమీక్షించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఆదేశించారు. ఈ క్రమంలో అమిత్ షా శ్రీనగర్ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడు అన్ని ఏజెన్సీలతో సమావేశం నిర్వహించనున్నారు.