హనీమూన్ జంట హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇండోర్కు చెందిన వ్యాపారి రాజా రఘువంశీ మేఘాలయలో హనీమూన్ సమయంలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో నలుగురు నిందితులు పోలీసులు ఎదుట నేరం ఒప్పుకున్నారు. హత్య సమయంలో రాజా భార్య సోనమ్ అక్కడే ఉండి తన భర్త హత్యను చూస్తూ నిల్చుందని నిందితులు వెల్లడించారు. మొదటి దాడి విషాల్ అలియాస్ వికీ ఠాకూర్ చేసినట్టు తెలిపారు. ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.