ఏపీలో పరువు హత్య కలకలం

64చూసినవారు
ఏపీలో పరువు హత్య కలకలం
వేరే మతానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకున్న యువతిని కుటుంబం హతమార్చింది. ఈ ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లా పద్మనాభునిసత్రంలో జరిగింది. రమణయ్య-దేవసేనమ్మల చిన్నకూతురు శ్రావణి (24) భర్తతో విడిపోయి రబ్బానీ బాషాతో మరో పెళ్లి చేసుకుంది. దాంతో శ్రావణిని తల్లిదండ్రులు, సోదరి, సోదరుడు ఇంటికి తీసుకొచ్చి దారుణంగా కొట్టారు. దాంతో శ్రావణి చనిపోయింది. మృతదేహాన్ని కుటుంబం ఇంటి పక్కనే పూడ్చిపెట్టారు. 25 రోజుల తర్వాత విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్