ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ఇప్పుడు విద్యారంగంలోకి అడుగుపెట్టింది. తాజాగా నీట్ పరీక్షలను సైతం క్లియర్ చేసింది. దీంతో పెద్ద సంచలన మార్పునకు దారి తీసింది. తాజాగా నిర్వహించిన 2025 జాతీయ అర్హత కమ్ ప్రవేశ పరీక్ష (నీట్)లో ఏఐ సిస్టమ్స్ అయిన ఏఐ అలీ మరో సంచలనం సృష్టించింది. నీట్ పరీక్షలో 720 మార్కులకు గాను 678 మార్కులు సాధించింది. ఏఐ సిస్టమ్ సాంకేతిక పరిజ్ఞానం శక్తిని ప్రపంచానికి చాటింది.