ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా కస్టమర్లకు గుడ్న్యూస్ చెప్పింది. తాజాగా ఎస్యూవీ ఎక్స్యూవీ 700 AX7 వాహన శ్రేణి ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎక్స్యూవీని మార్కెట్లో విడుదల చేసి మూడేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో కొత్త ధరలను మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. ఎంపిక చేసిన వేరియంట్లపై గరిష్ఠంగా రూ.2.2 లక్షల మేర తగ్గింపు లభిస్తుంది. కొత్త ధరలు జులై 10 నుంచి అందుబాటులోకి రానున్నాయి.