SLBC సొరంగంలో రెండు వారాలుగా కొనసాగుతున్న సహాయక చర్యల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేరళ నుంచి తీసుకొచ్చిన కాడవర్ డాగ్స్ మట్టిలొపల మానవ అవశేషాలు ఉన్నట్లు గుర్తించాయి. దీంతో మట్టి తొలగింపు ప్రక్రియను మరింత ముమ్మరం చేశారు. ఈ క్రమంలో అక్కడ మానవ చర్మం బయటపడింది. మరింత లోపలికి వెళ్లేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అయితే అందుకు టీబీఎం మెషీన్ భాగాలు అడ్డంకిగా మారాయి. కాగా, వాటిని కట్ చేస్తూ మట్టిని తొలగిస్తున్నారు.