
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ప్రధాని మోదీ ఆరా
అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి పౌరవిమానయానశాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడితో ఫోన్లో మాట్లాడారు. ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అవసరమైన అన్ని సహాయ చర్యలు తక్షణమే తీసుకోవాలని ప్రధాని ఆదేశించారు. ప్రమాద పరిణామాలను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని కూడా మంత్రి రామ్మోహన్ను మోదీ కోరారు.