మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను ఉంచాలని ఏపీ హైకోర్టులో పిల్ దాఖలయ్యింది. ఈ ఏడాది జూన్ 2తో పదేళ్ల ఉమ్మడి రాజధాని సమయం ముగియనుంది. దీంతో 2034 వరకు పొడిగించాలని పిటిషన్ దాఖలయ్యింది. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పులు వంటివి విభజన చేయాల్సినవి చాలా ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిల్ పై విచారించిన కోర్టు.. విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.