హైదరాబాద్ను పొగుడుతూ ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ ట్వీట్ చేశారు. హైదరాబాద్ భారతదేశపు ఫ్యూచర్ సిటీగా మారుతుందని, 2036 ఒలింపిక్స్ భారత్లో నిర్వహిస్తే తాను హైదరాబాద్ను ఎంపిక చేస్తానని అన్నారు. క్రీడా సౌకర్యాలు, విశాలమైన ల్యాండ్ బ్యాంక్, బలమైన సేవా రంగం, బహుళ సంస్కృతుల సమ్మేళనం దీనికి కారణమని పేర్కొన్నారు. బ్యాడ్మింటన్ రాజధానిగా ఉన్న హైదరాబాద్ను ఒలింపిక్స్ నగరంగా ఎంచుకోవాలనే దానిని మీరు అంగీకరిస్తారా అని అడిగారు.