మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరిగిన 30ఏళ్ల ఎమ్మార్పీఎస్ సుదీర్ఘమైన అలుపెరుగని పోరాటంలో అంతిమంగా ధర్మమే గెలిచిందని ఎం ఎస్ ఎఫ్ నాయకులు అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం పట్ల ఎం ఎస్ ఎఫ్ అధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజి ప్రాంగణంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకుని, పటాకులు కాల్చి విద్యార్థులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.