అంబర్ పేట్: బస్తీ దవాఖానాలో కార్పొరేటర్ తనిఖీలు

67చూసినవారు
అంబర్ పేట్: బస్తీ దవాఖానాలో కార్పొరేటర్ తనిఖీలు
బస్తీ దవాఖానాల ద్వారా పేద ప్రజలకు మంచి వైద్య సేవలు అందుతున్నాయని కాచిగూడ డివిజన్ కార్పొరేటర్ కన్నె ఉమా రమేష్ యాదవ్ అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని దవాఖానాను కార్పొరేటర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మందుల కొరత లేకుండా చూసుకోవాలని వైద్య సిబ్బందికి కార్పొరేటర్ సూచించారు.

సంబంధిత పోస్ట్