ఓయూలో విద్యార్థులు మరోసారి ఆందోళనలు చేపట్టారు. సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతించాలంటూ పీజీ విద్యార్థులు బుధవారం రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. 75% హాజరు శాతం లేదంటూ పరీక్ష ఫీజు స్వీకరించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఫీజు స్వీకరించి పరీక్షలు రాసేందుకు అనుమతించాలంటూ డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలంటూ నినదించారు.