తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఉత్తరప్రదేశ్ స్పీకర్ సతీష్ మహానా తన సతీమణితో కలిసి గురువారం బంజారాహిల్స్ లోని అధికారిక నివాసంలో కలిశారు. సతీష్ మహానా దంపతులను తెలంగాణ స్పీకర్ శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం, జ్ఞాపికను అందజేసి మెమెంటో బహుకరించారు. ఇరువురు శాసనసభల నిర్వహణపై అభిప్రాయాలు పంచుకున్నారు.