కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి జరిగే ఆషాడ బోనాలను భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ లో సమన్వయ సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రజల విశ్వాసం, ఆచారం, సంస్కృతి బోనాల పండుగ అని గుర్తు చేశారు. ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలకు తావు లేకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైదరబాద్ లో నెల రోజుల పాటు జాతర అంగరంగ వైభవంగా జరిపిస్తామని మంత్రి వివరించారు.