సికింద్రాబాద్ లో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో శుక్రవారం వైభవంగా చండీ హోమం జరిగింది. ఈరోజు పౌర్ణమి సందర్భంగా ఆలయ పూజారులు, వేద పండితులు చండిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గుత్త మనోహర్ రెడ్డి, ఆలయ ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ కామేశ్వర్, మాజీ చైర్మన్ రామేశ్వర్, మాజీ ధర్మకర్త మండలి సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.