ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిస్టులపై సీఐ చేసిన దాడిని ఖండిస్తూ బుధవారం ఓయూ పోలీస్ స్టేషన్ ముందు పలువురు జర్నలిస్టులు, విద్యార్థి సంఘాల నాయకులు ధర్నాకు దిగారు. న్యూస్ కవరేజీ కోసం వెళ్లిన విలేకరిపై ఓయూ సీఐ దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండించారు. తక్షణమే ఓయూ సీఐ రాజేందర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపైన నూతనంగా బాధ్యతలు చేపట్టిన డిజీపీ చర్యలు తీసుకోవాలని కోరారు.