మూసి ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై చిన్న తరహా పరిశ్రమల యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అంబర్ పేట్ మూసి పరివాహక ప్రాంతంలోని న్యూ దుర్గ నగర్లో కంపెనీల యజమానులు తహశీల్దార్ కార్యాలయం ముందు శుక్రవారం ధర్నాకు దిగారు. పరిశ్రమలను ఉన్నపళంగా కూల్చి వేస్తే వందలాది యజమానులతో పాటు వాటిలో పని చేస్తున్న వేలాది అసంఘటిత కార్మికులు రోడ్డున పడతారన్నారు.