
సెలవులు రద్దు.. కేంద్రం కీలక ఆదేశాలు జారీ
భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా మెడికల్ సిబ్బంది, అధికారుల సెలవులన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం లీవ్లో ఉన్నవారు వెంటనే విధుల్లో చేరాలని పేర్కొంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వైద్య కారణాల వల్ల తప్ప ఏ అధికారికి సెలవు ఇవ్వకూడదని ఆదేశించింది.