హైదరాబాద్ నార్సింగి పీఎస్ పరిధిలోని హైదర్షా కోట్లో ఓ బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ కేసులో శనివారం సంచలన విషయాలు తెలుస్తున్నాయి. పార్కులో ఆడుకుంటున్న బాలికను ఓ యువకుడు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం తన నలుగురు స్నేహితులతో కలిసి మరోసారి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను బెదిరించి ఇంట్లో ఉన్న నగలు తేవాలని కోరడంతో అసలు విషయం తెలిసినట్లు పోలీసులు తెలిపారు.