హైదరాబాద్: మా ప్రభుత్వం కాంట్రాక్టర్లు కూల్చితే కూలేది కాదు: టీపీసీసీ చీఫ్​

65చూసినవారు
హైదరాబాద్: మా ప్రభుత్వం కాంట్రాక్టర్లు కూల్చితే కూలేది కాదు: టీపీసీసీ చీఫ్​
కాంట్రాక్టర్లు కూల్చితే కూలే ప్రభుత్వం తమది కాదని టీపీసీసీ చీఫ్​ మహేష్ ​కుమార్​ గౌడ్​ పేర్కొన్నారు. తమకు ఎమ్మెల్యేల సంపూర్ణ మద్దతు ఉందని ఆయన స్పష్టం చేశారు. కొత్త ప్రభాకర్​రెడ్డి వ్యాఖ్యలపై ప్రభుత్వ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మహేష్ ​కుమార్ తెలిపారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ​పదేళ్లు దోచుకుందంటూ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేలంటే అంగట్లో సరుకులు కాదని, ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గౌరవం లేదని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్