కాంట్రాక్టర్లు కూల్చితే కూలే ప్రభుత్వం తమది కాదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. తమకు ఎమ్మెల్యేల సంపూర్ణ మద్దతు ఉందని ఆయన స్పష్టం చేశారు. కొత్త ప్రభాకర్రెడ్డి వ్యాఖ్యలపై ప్రభుత్వ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మహేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పదేళ్లు దోచుకుందంటూ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేలంటే అంగట్లో సరుకులు కాదని, ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్కు గౌరవం లేదని మండిపడ్డారు.