హైదరాబాద్: మంచి విద్య కోసం ఎంత ఖర్చైనా పెడతాం

73చూసినవారు
హైదరాబాద్: మంచి విద్య కోసం ఎంత ఖర్చైనా పెడతాం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలో అన్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలని.. మౌలిక వసతులు, ఉపాధ్యాయులకు శిక్షణ, ఇతర సదుపాయాల కల్పనకు ఎంత ఖర్చైనా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 20 మంది కంటే ఎక్కువ పిల్లలున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు ప్రారంభిస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్