తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను అరిగోస పెడుతున్న రేవంత్ సర్కార్ పై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని BRS నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తాము కాంగ్రెస్ అని చెప్పుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో యువ నాయకుడు ఏరువ సాయిప్రసాద్ యాదవ్తో పాటు కాంగ్రెస్, బీజేపీలకు చెందిన యువకులు పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు.