కిషన్ బాగ్ డివిజన్ పరిధిలోని బాబా నగర్లో కొనసాగుతున్న డ్రైనేజీ లైన్ పనులను డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ హుస్సేన్ పాషా ఆదివారం అధికారులతో కలిసి పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. పనులు పూర్తి అయిన వెంటనే రోడ్డు పనులు కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. సకాలంలో పనులను పూర్తి చేసి స్థానిక ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కాంట్రాక్టర్ కు ఆదేశించారు.