జహనుమా డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సిబ్బందితో కలిసి డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ ముక్తదర్ బాబా శనివారం పర్యటించారు. డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో శిధిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాలను తొలగించాలని సిబ్బందికి సూచించారు. కొత్త స్తంభాలను ఏర్పాటు చేసి కేబుల్స్, విధి దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. మొహర్రం పండుగను పురస్కరించుకుని త్వరగా ఈ పనులను పూర్తి సిబ్బందికి ఆదేశించారు.