పాతబస్తీలో చిన్న వివాదం విషాదంగా మారింది. జాకీర్ ఖాన్ హఫీజ్(62) బాబానగర్లోని సీ బ్లాకులో కిరణ దుకాణాన్ని నడుపుతున్నాడు. పక్కనే ఉన్న పాన్ షాప్ కు వచ్చిన యువకులు షాపు ముందు కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. ఈ క్రమంలో తలెత్తిన ఘర్షణలో జాకీర్ పై యువకులు దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. కంచన్ బాగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నిన్న అర్థరాత్రి జరగగా నేడు సీసీ కెమెరా దృశ్యాలు బయటకు వచ్చాయి.