విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జులై 14వ తేదీన హైదరాబాద్ పాతబస్తి ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ తరఫున నిర్వహించే బోనాల ఉత్సవాలకు తగిన ఏర్పాట్లు చేయాలని ఈవో రామారావుని కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య కోరారు. బుధవారం ఉపాధ్యక్షుడు మధుసూదన్ యాదవ్, మాజీ చైర్మన్ మధుసూదన్ గౌడ్ లతో కలిసి ఈ మేరకు ఆయనకు వినతిపత్రాన్ని అందజేశారు. వెయ్యి మందితో ఈ బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు.