చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్లో జరిగిన భారీ అగ్నిప్రమాద స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. మీడియాతో మాట్లాడుతూ. సమాచారం అందగానే ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారని, ప్రభుత్వం తరఫున బాధితులకు అండగా ఉంటామని చెప్పారు ప్రమాదాలు చెప్పి రావని, ఇలాంటివాటిని ముందుగా ఊహించడం సాధ్యం కాదన్నారు. దీంట్లో ప్రభుత్వ నిర్లక్ష్యం ఏమీలేదన్నారు. ఘటనపై రాజకీయాలు చేయొద్దని సూచించారు.