హైదరాబాద్ చార్మినార్ వద్ద ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ప్రమాద స్థలానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో మరోసారి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫైర్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఎక్విప్మెంట్లు పెంచాలని కోరారు.