అసెంబ్లీలోని తన ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి డప్పు కొట్టి దరువేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించి రాష్ట్రంలో వెంటనే అమలు చేస్తామని ప్రకటించినందుకు సీఎంకు మంత్రులు, ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు. పలువురు కాంగ్రెస్ నాయకులు డప్పు దరువులతో వచ్చి సీఎంకు ధన్యవాదాలు తెలుపగా వారితో కలిసి సీఎం కూడా డప్పు కొట్టి దరువు వేశారు.