హైదరాబాద్ చార్మినార్ పరిధిలోని గుల్జార్హౌస్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై సీఎం రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 8 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ను ఘటనాస్థలానికి వెళ్లాలని ఆదేశించారు. మరికాసేపట్లో పొన్నం అక్కడికి వెళ్లనున్నారు.