రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి జపాన్లో పర్యటించనున్నారు. సీఎం బృందం నిన్న రాత్రి బెంగళూరు నుంచి జపాన్కు బయలుదేరి వెళ్లింది. ఈనెల 22 వరకు జపాన్లోని టోక్యో, మౌంట్ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో ఈ బృందం పర్యటించనుంది. అక్కడ ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక వేత్తలు, పలువురు ప్రతినిధులతో సీఎం బృందం సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు తదితర అంశాలపై చర్చించనుంది.