హైదరాబాద్ పాతబస్తీ మిర్చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డాకోయిటీ కేసును పోలీసులు ఛేదించారు. ఐదుగురి నిందితులను అరెస్టు చేసి 80 వేలకు పైగా నగదు, మొబైల్ ఫోన్లు, బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సౌత్ జోన్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ స్నేహ మెహ్ర ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ ముఠా గత కొన్ని వారాలుగా పలు దోపిడీలు జరిపినట్లు సమాచారం.