రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని మైసిగండిలో రోడ్డు ప్రమాదం జరిగింది. సీఐ శివప్రసాద్ వివరాలు.. హైదరాబాద్ నుంచి మాడ్గుల మండలం ఇర్విన్ కి ద్విచక్రవాహనంపై వెళ్తున్న వెంకటయ్య, భీమయ్య, శివను స్కార్పియో వాహనం ఢీకొంది. దీంతో పక్కనుంచి వెళుతున్న బొలెరో వాహనాన్ని తగలగా అది కూడా బోల్తా పడింది. ఈ ఘటనలో వెంకటయ్య అక్కడికక్కడే మృతి చెందగా.. భీమయ్యను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.