హైదరాబాద్కు చెందిన ప్రముఖ సైకాలజిస్ట్ డా. రాకేష్ పారిపల్లి ఇటీవల ప్రఖ్యాత AI నిపుణులు నికీలు గుండా ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ను విజయవంతంగా పూర్తి చేశారు. ఏప్రిల్ 27, 2025న హైదరాబాద్లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో నీలోఫర్ వ్యవస్థాపకుడు అనుముల బాబూరావ్, చార్టర్డ్ అకౌంటెంట్ అభిషేక్ బొడ్డు ముఖ్య అతిథులుగా పాల్గొని డా. రాకేష్ పారిపల్లికి AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు. ఈ సందర్భంగా డా. రాకేష్ పారిపల్లి మాట్లాడుతూ తెలుగు AI బూట్ క్యాంప్ తన వృత్తి జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందన్నారు. AI టూల్స్ను ప్రాక్టికల్గా ఉపయోగించడం ద్వారా నా సాంకేతిక నైపుణ్యాలు బాగా పెరిగాయన్నారు. ఈ శిక్షణ నా సైకాలజీ ప్రాక్టీస్లో క్లయింట్లకు మరింత సమర్థవంతమైన సేవలు అందించడంలో, డేటా ఆధారిత విశ్లేషణలతో నూతన ఆవిష్కరణలు చేయడంలో దోహదం చేస్తుందని ఆశిస్తున్నానన్నారు. ఈ అవకాశం కల్పించిన గ్రోత్ క్లబ్ టీమ్కు, నికీలు గుండాకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు!" అని తెలిపారు. తరువాతి తెలుగు AI బూట్ క్యాంప్ జూన్ 1, 2025న ప్రారంభం కానుంది.