T-Hubలో గణనాధ పెంట‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

50చూసినవారు
T-Hubలో గణనాధ పెంట‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం
మణికొండ, హైదరాబాద్‌కు చెందిన గణనాధ పెంట, ఇటీవల ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండా ఆధ్వర్యంలో నిర్వహించబడిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తిచేశారు. మార్చి 9న T-Hub, హైదరాబాద్‌లో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో గంపా నాగేశ్వరరావు, నికీలు గుండా, బిఎన్‌ఎస్ శ్రీనివాస్ పాల్గొని గణనాధ పెంటకు AI గ్రాడ్యుయేషన్ పట్టా అందజేశారు. గణనాధ పెంట మాట్లాడుతూ,
తెలుగు AI బూట్ క్యాంప్ నాకు కెరీర్‌పై స్పష్టత కలిగించిందన్నారు. AI టూల్స్‌ను నేర్చుకోవడం, వాటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా కొత్త అవగాహన పొందానన్నారు. ఈ బూట్ క్యాంప్ ద్వారా వృత్తి జీవితాన్ని కొత్త కోణంలో చూడగలిగానని, ఇప్పుడు నేర్చుకున్న టెక్నాలజీని ప్రొఫెషన్‌లో సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నానన్నారు.ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన గ్రోత్ క్లబ్ టీమ్‌కు, మెంటర్ నికీలు గుండా కు హృదయపూర్వక కృతజ్ఞతలు!"* అని అన్నారు.
వచ్చే తెలుగు AI బూట్ క్యాంప్ బ్యాచ్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది.

సంబంధిత పోస్ట్