బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన తప్పుడు వాదనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్లు తగ్గించడంపై విమర్శలు వ్యక్తం చేసిన ఆయన, సవరణలకు డిమాండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 34% రిజర్వేషన్లను 18%కి తగ్గించిందని తెలిపారు. ప్రభుత్వ తప్పిదం సరిచేయాలని వారు సూచించారు.