హైదరాబాద్ మెట్రో ఛార్జీలు త్వరలో పెరగనున్నట్లు తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు తమ నష్టాలు రూ.6,500 కోట్లకు చేరాయని హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ పేర్కొంది. నష్టాలు ఏటా పెరుగుతుండటం, ఇటీవల బెంగళూరులో మెట్రో ఛార్జీలు 44 శాతం పెరగడంతో హైదరాబాద్ మెట్రో సైతం ఛార్జీల పెంపునకు సిద్ధపడిందని సమాచారం. ఇప్పటికే రూ.59 హాలిడే సేవర్ కార్డును, మెట్రో కార్డుపై రద్దీవేళల్లో 10 శాతం రాయితీనీ ఎత్తివేసింది.