పెద్ద అంబర్‌పేట: కారు మంటల్లో చిక్కుకొని ఇద్దరు సజీవ దహనం

50చూసినవారు
పెద్ద అంబర్‌పేట: కారు మంటల్లో చిక్కుకొని ఇద్దరు సజీవ దహనం
ఔటర్ రింగ్ రోడ్డుపై పెద్ద అంబర్‌పేటలో ఘోర ప్రమాదం జరిగింది. బొలెరో వాహనాన్ని కారు ఢీకొట్టింది. దాంతో మంటలు చెలరేగి రెండు వాహనాలు కాలిపోయాయి. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని టాటా క్వారీ వాహనం ఢీకొట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదం సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఇందులో ఇద్దరు సజీవ దహనం కాగా, మరొకరిని మంటల నుంచి కాపాడి హాస్పిటల్ కు తరలిస్తున్న సమయంలో మృతి చెందారు.

సంబంధిత పోస్ట్