హైదరాబాద్లో న్యాయవాది శైలేష్ సక్సేనాకు దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. కారులో వెంబడించి గన్తో బెదిరించారని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ల్యాండ్ కేసుల్లో శత్రువులు ఉన్నారని పేర్కొన్నారు. గతంలో ఫోర్జరీ కేసుల్లో శైలేష్ అరెస్టయిన విషయం ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.